వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ…

మామిడి చెట్లు నరికివేసి, ఫెన్సింగ్ రాళ్లు పగలు గొట్టి

వెంకటాద్రిపాలెంలో దౌర్జన్య కాండ…

  • మామిడి చెట్లు నరికివేసి, ఫెన్సింగ్ రాళ్లు పగలు గొట్టి….

వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 284/1 లో మూడు ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి మాల్యాద్రి అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా సాగుబడి చేస్తూన్నారు. ఇటీవల కాలంలో మామిడి చెట్లను ఏర్పాటు చేసి సాగు చేసి, చుట్టూ ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ భూమిపై సర్వహక్కులు మావే అంటూ వింజమూరు ప్రాంతానికి చెందిన వీరదిమ్మే మధు అనే వ్యక్తి వచ్చి సాగులో ఉన్న మామిడి చెట్లను నరికి వేసి, ఫెన్సింగ్ రాళ్లను పగలగొట్టి అడ్డు వచ్చిన వారిని బెదిరించి దౌర్జన్య కాండకు తెగబడ్డారని మాల్యాద్రి భార్య విజయమ్మ వాపోయారు. దాదాపుగా 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. విజయమ్మ మాట్లాడుతూ… మధు అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకువచ్చి ఫెన్సింగ్ రాళ్లు, మామిడి చెట్లు, డ్రిప్ పైపులను,చెల్లాచెదురు చేసి విధ్వంసం సృష్టించారని ఆమె వాపోయింది. మానసిక దివ్యాంగుడైన మా కొడుకునీ కొట్టి, నా పై దాడికి తెగబడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేసేరు. త‌హ‌సీల్దార్‌ ఈ విషయం పై జోక్యం చేసుకొని సదర పొలం ఎవరికీ చెందుతుందో తెలియజేయాలనీ విజయమ్మ డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *