కైవల్యా నది కాదది.. కంపు నది..!!

దుర్గంధం వెదజల్లుతున్న కైవల్యానది, పరిసర ప్రాంతాలు.

పట్టించుకోని పాలకులు, అధికారులు

ఎమ్మెల్యే కురుగొండ్ల సర్.. ఓ లుక్ వేయండి

కైవల్యా నది కాదది.. కంపు నది..!!

-దుర్గంధం వెదజల్లుతున్న కైవల్యానది, పరిసర ప్రాంతాలు.
-పట్టించుకోని పాలకులు, అధికారులు
-ఎమ్మెల్యే కురుగొండ్ల సర్.. ఓ లుక్ వేయండి

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో, నడిబొడ్డులో ప్రవహించే కైవల్యా నది,
వెంకటగిరి పట్టణానికి, బయట ప్రాంతాల నుండి రావాలన్నా, తిరిగి వెళ్ళాలన్నా కైవల్యానికి ఉన్న, నాలుగు వంతుల దాటాల్సిందే,

ఈ వంతెనలల్లో ప్రధానమైన వెంకటగిరి నుండి డక్కిలికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న వంతెన ప్రయాణికులకు, ఈ నదికి పక్కనే ఉన్న, ప్రభుత్వ ఐటి కాలేజీ, విద్యార్థుకు, సమస్యగా మారింది.

ఈ కాలేజీకి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా, ఈ వంతెన వద్ద బస్సు దిగాల్సిందే, ఇక్కడనుండి నడుచుకుంటూ కాలేజీ కి వెళ్ళాలి.

ఈ వంతెన నుండి కాలేజీ వరకు కైవల్యా నది మొత్తం, కోళ్ల వ్యర్ధపదార్ధాలు, చనిపోయిన జంతు కళేబరాలు, కాలం చెల్లిన వారి వస్తు సామాగ్రి, వారి బట్టలు, ఇళ్లల్లోని చెత్త, తాగి పడేసిన మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, అనేకమైన వ్యర్ధాలు ఇక్కడ వేయడంతో, విద్యార్థులకే గాక, ఈ వంతెన మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు, ఈ నదికి చుట్టుపక్కల నివాసముంటున్న వారు, వీటి దుర్గంధమైన వాసనకి, ఉండలేకపోతున్నారు.

కాలేజీ విద్యార్థులు ముక్కులు మూసుకుని, వెళ్లాల్సి వస్తుంది.

ఈ విషయమై కాలేజీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ, మా విద్యార్థులు మేము, అనారోగ్యానికి గురవుతున్నామని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వంతెనే కాక.. మల్లమ్మ గుడి, శివాలయం మార్గమధ్యంలో ఉన్న, కైవల్యా నది, పరిసర ప్రాంతాలు, మున్సిపాలిటీ చెత్తకీ, అడ్డాగా మారింది,

ఎంత చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ ప్రాంతాలలో ఇటువంటివి జరగకుండా తగు సూచన బోర్డులు పెట్టాలని, వెంటనే ఈ ప్రాంతాలను శుభ్రపరచాలని కోరుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అటువైపు ఓ లుక్ వేయాలని.. అంతా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *