ఎన్ని కేసులైనా పెట్టుకోండి…భ‌య‌ప‌డ‌ను

కూట‌మి ప్ర‌భుత్వానికి కాకాణి వార్నింగ్

ఎన్ని కేసులైనా పెట్టుకోండి…భ‌య‌ప‌డ‌ను

  • కూట‌మి ప్ర‌భుత్వానికి కాకాణి వార్నింగ్

కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై వరుస కేసులు నమోదవుతున్నాయని…ఇప్పటికే ఆరు కేసులు పెట్టారని.. ఇది ఎడవ కేసు అని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నామ‌ని…అందుకే త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం సిగ్గుచేట‌న్నారు. తాజాగా క్వార్జ్ మైన్స్ అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండ‌ని…నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాన‌ని…కాకాణి త‌న‌దైన శైలిలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. కేసు వివరాలు ఏంటనేది కూడా తెలియాల‌న్నారు. పస లేకుండానే కేసులు పెడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఖ‌చ్చితంగా కేసుల‌పై న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తాన‌న్నారు. నెల్లూరులోని త‌న కార్యాల‌యంలో కాకాణి మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *