సంగంలో ఘటన
భర్త ఇంటి ముందు భార్య నిరసన…
- సంగంలో ఘటన
తన భర్త మన్సూర్ ఇంటి ముందు భార్య లక్ష్మీ నిరసన చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మసీదు సెంటర్లో చోటు చేసుకుంది. హైదరాబాదులో నన్ను ప్రేమ పెళ్లి చేసుకుని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయాడని వాపోయింది. నా భర్త నాకు కావాలంటూ భర్త ఇంటి ముందు కూర్చునీ నిరసన తెలిపింది. నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడి నుండి వెళ్ళను అని తేల్చి చెప్పింది. నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నా భర్త వచ్చే వరకు చావనైనా చస్తా కానీ పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని తెలిపింది.