హౌసింగ్ ఈఈ మోహన్రావు
సంగంలోని హౌసింగ్ కార్యాలయాన్ని సందర్శించిన ఈఈ
లబ్ధిదారులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి…
- ఈఈ మోహన్రావు
- సంగంలోని హౌసింగ్ కార్యాలయాన్ని సందర్శించిన ఈఈ
నెల్లూరు జిల్లా సంగం హౌసింగ్ కార్యాలయాన్నీ ఈఈ మోహనరావు సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించి .. ఇళ్ల నిర్మాణాల పురోగతి పై ఏ ఈ గౌస్ మొహిద్దీన్ తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చే రాయితీని హౌసింగ్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 వేల రూపాయలు, బీసీ లబ్ధిదారులకు 50 వేల రూపాయలు రాయితీని అందిస్తుందని తెలిపారు. లబ్ధిదారులు రాయితీని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి జూన్ 12 వ తేదీన సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమం లో హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.