ఉభయకర్తలుగా కంభం శ్రీనివాసులు దంపతులు
విశేషంగా పాల్గొన్న భక్తులు
కన్నుల పండువగా శ్రీవారి కళ్యాణోత్సవం…
- ఉభయకర్తలుగా కంభం శ్రీనివాసులు దంపతులు
- విశేషంగా పాల్గొన్న భక్తులు
నెల్లూరురూరల్నియోజకవర్గం మూడో మైలులోని గణేష్ నగర్లో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవానికి కంభం శ్రీనివాసులురెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామి అమ్మవార్లన కళ్యాణ ఘట్టాన్ని తిలకించి పునీతులయ్యారు. శ్రీవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.