రోజుకో ప్రమాదం రోజుకో మ‌ర‌ణం

వాచ్ ద N3 న్యూస్

రోజుకో ప్రమాదం…రోజుకో మరణం…ఇందుకు ఎవ‌రు కార‌ణం…? ప్ర‌మాదాల్ని ఎందుకు నివారించ‌లేక‌పోతున్నారు…? ఇలా ఎన్నో అనుమానాలు…? అస‌లు ఆ మండ‌లంలో ఎందుకిలా జ‌రుగుతోంది… అది ఏ జిల్లా….ఏ మండ‌లం తెలుసుకోవాలంటే ఎన్ న్యూస్ చూడాల్సిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండల కేంద్రంలో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతుండడం…రోజుకొక‌రు మృత్యువాత ప‌డుతుండ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ గ్రామంలోనే ఎందుకిలా జ‌రుగుతోంద‌ని వాహ‌న‌దారులు, స్థానికులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, ఖమ్మం నుంచి ఆంధ్రాకు వెళ్లాలంటే కచ్చితంగా దమ్మపేట మండలం నుంచే వెళ్లాలి. అయితే దమ్మపేటలో అక్క‌డ‌క్క‌డే హెచ్చరికబోర్డులు ఉండ‌డం, కొన్ని ద‌గ్గ‌ర ఉన్నా… క‌నిపించ‌క‌పోవ‌డం….రోడ్డుకి మ‌ధ్య డివైడ‌ర్ లేక‌పోవ‌డ‌మే ప్ర‌మాదాల‌కు ముఖ్య కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. రోజుకొక ప్ర‌మాదం జ‌రుగుతున్నా…సంబంధిత అధికారులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా సంబంధిత అధికారులు స్పందించి…ద‌మ్మ‌పేట మండ‌లంలో హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని…అదే విధంగా రోడ్డు భ‌ద్ర‌త నియ‌మ నిబంధ‌న‌ల‌పై వాహ‌నాల‌కు అవ‌గాహ‌న కల్పించి…ప్ర‌మాదాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *