డీపీఎల్వో విచారణలో తేలిన రూ. 53 లక్షల అవినీతి
డక్కిలిలో హాస్యాస్పదంగా రాజకీయం
అవినీతి అనకొండ.. ఆ సర్పంచ్..!!
- డీపీఎల్వో విచారణలో తేలిన రూ. 53 లక్షల అవినీతి
- డక్కిలిలో హాస్యాస్పదంగా రాజకీయం
తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీలో రాజకీయం హాస్యాస్పదం గా తయారైంది. రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులకు పంచాయతీలోని రెండు వర్గాల మధ్య గొడవలకు కారణం అవుతుంది. డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రతి వ్యక్తి రాజకీయం చేస్తూ పార్టీకి , పార్టీ నాయకులకు తలవంపులు తెస్తున్నారు. అంతే కాదు చేతకాని రాజకీయం చేయడమే కాకుండా ఆ రొచ్చులోకి రాజకీయం అంటే ఏమిటో తెలియని సర్పంచ్ ను సైతం 53 లక్షల రూపాయలు అవినీతిలో భాగస్వామం చేసిన ఘనత డక్కిలి పంచాయతీ కే చెందుతుంది.
వివరాల్లోకి వెళ్లితే…. గత వైసీపీ ప్రభుత్వంలో డక్కిలి పంచాయతీ సర్పంచ్ శనగ వేమక్క 53 లక్షల రూపాయలు పంచాయతీ నిధులను దుర్వినియోగంకి పాల్పడంతో పంచాయతీ సెక్రటరిని సస్పెండ్ చేయగా, సర్పంచ్ వేమక్కకు చెక్ పవర్ తొలగిస్తూ చర్యలు తీసుకొన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది మాటలు విని ఇప్పుడున్న పంచాయతీ సెక్రటరీనీ నాకు మర్యాద ఇవ్వడం లేదని నాకు ఏ విషయం చెప్పడంలేదని డక్కిలి పంచాయితీ వేమక్క.. సదరు పంచాయతీ సెక్రటరిపై పీజీ ఆర్ యస్ ద్వారా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా డి ఎల్ పి ఓ డక్కిలి పంచాయతీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడం.. ఫిర్యాదు నేను చేయలేదంటే.. నేను చేయలేదని.. అందులో ఏం రాశారో కూడా తనకు తెలియదని.. పంచాయతీ నిధులు 53లక్షల దుర్వినియోగం విషయం కూడా తెలియదని వారు సమాధానాలు చెప్పడం చూస్తుంటే.. నిజంగానే హాస్యాస్పదంగా ఉందంటున్నారంతా.. ఓపక్క సర్పంచ్ వేమక్క విచారణకు సహకరించడంలేదని అధికారులంటున్నారు. అలాగే.. గతంలో పనిచేసి.. సస్పెండ్ కు గురైన పంచాయతీ సెక్రటరీ ఈ అవినీతికి భాగస్వాములైన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదుచేస్తామని విచారణాధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు మాజీ జడ్పిటిసి వేలేశ్వరం రామచంద్ర నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, దందోలు పెంచల్ రెడ్డి, మావుడూరు రమేష్ బాబు, సునీల్ రెడ్డి, దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, పొట్టేల శ్రీనివాసులు, సర్వేపల్లి రత్నయ్య, తదితరులు పాల్గొన్నారు