వర్శిటీని మరింత అభివృద్ధి చేస్తాం
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
వీఎస్యూలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
ఆ శక్తి… ఒక్క యువతకే ఉంది…
- వర్శిటీని మరింత అభివృద్ధి చేస్తాం…
- సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
- వీఎస్యూలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
జగన్ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తే ఎక్కడకో వెళ్లి ఉండేది అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని వీఎస్యూ లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా సోమిరెడ్డికి ప్రొఫెసర్లు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ…. వర్సీటీని మరింత అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళుతామన్నారు. ప్రతి ఏడాది చదువు పూర్తి చేసుకుని బయటకి వచ్చే వారందరికీ ఉపాధి కల్పించడం అవసరం అన్నారు. దేశ ముఖచిత్రాన్ని మార్చగల శక్తి యువతకే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ కే సునీత, విశ్వవిద్యాలయం సిబ్బంది, విద్యార్థులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.