సంప‌ద సృష్టించ‌డ‌మే కూట‌మి ల‌క్ష్యం

స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెంక‌టాచ‌లంలో చెత్త‌ను సేక‌రించేందుకు ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సంప‌ద సృష్టించ‌డ‌మే కూట‌మి ల‌క్ష్యం…

  • స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
  • వెంక‌టాచ‌లంలో చెత్త‌ను సేక‌రించేందుకు ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో చెత్త సేక‌ర‌ణ ట్రాక్ట‌ర్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి….మండ‌లంలోని వివిధ పంచాయ‌తీల‌కు చెత్త‌ను సేక‌రించేందుకు ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం సోమిరెడ్డి మాట్లాడుతూ….మన రాష్ట్రానికి హైదరాబాద్ లేకపోయినా… చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దు చేసి..చెత్తను సేకరించి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో కల్పన, బొమ్మి సురేంద్ర, రావూరు రాధాకృష్ణ నాయుడు, ఈపూరు సుబ్బారెడ్డి, అధికారులు,టిడిపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *