ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేయండి
- ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..
ఈ నెల 26 నుంచి 29 వరకు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారని… ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 26న హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారన్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గన గుడిపల్లి మండలానికి ఆమె విచ్చేస్తారన్నారు. మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భువనేశ్వరి ప్రోగ్రాం విజయవంతం చేయాలని కంచర్ల శ్రీకాంత్ కోరారు.