ప‌దేళ్లుగా ఉద్యోగ నియామ‌కాల్లేవు

ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతాం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల ఆవేద‌న

ప‌దేళ్లుగా ఉద్యోగ నియామ‌కాల్లేవు…

  • ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతాం
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల ఆవేద‌న

ఆంధ్ర రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎలాంటి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రామ‌కృష్ణారావు మాట్లాడుతూ… రాష్ట్రంలో మాల కులస్తులకు జరుగుతున్న‌ అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ల‌డ‌మే స‌మాజ చైత‌న్య స‌మితి ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. గ‌త ప‌దేళ్లుగా ఎలాంటి ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. వీట‌న్నింటిని ఎదుర్కొనేందుకే మేధావులతో కలుపుకొని సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రెటరీT. కృష్ణ , సమాజ చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి రంగనాథ్ , సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *