సూళ్లూరుపేటకు చేరుకున్న సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ
9 రాష్ట్రాల గుండా 25 రోజుల పాటు కొనసాగనున్న 6553 కిలోమీటర్ల ర్యాలీ
మార్చి 31న కన్యాకుమారిలో ర్యాలీ ముగించనున్నట్లు తెలిపిన సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సంజిత్ కుమార్
సూళ్లూరుపేటలో సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీకి ఘన స్వాగతం
భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షం
- సూళ్లూరుపేటకు చేరుకున్న సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ
- 9 రాష్ట్రాల గుండా 25 రోజుల పాటు కొనసాగి 6553 కిలోమీటర్ల ర్యాలీ
- మార్చి 31న కన్యాకుమారిలో ర్యాలీ ముగించనున్నట్లు తెలిపిన సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సంజిత్ కుమార్
- సూళ్లూరుపేటలో సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీకి ఘన స్వాగతం
భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షంగా పెట్టుకొని సీఐఎస్ఎఫ్ పోలీస్ బలగాల ఆద్వర్యంలో కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు సైక్లోథాన్ బృందం సోమవారం చేరుకోవడంతో శ్రీహరికోట అంతరిక్ష విభాగం, సూళ్లూరుపేట పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వారి సైకిల్ ర్యాలీకి ఘనస్వాగతం పలికారు. ఈ ర్యాలీ నేరుగా తడ మండలం అక్కంపేట వద్ద ఉన్న జైన్ మందిర్ వద్దకు చేరుకుంది. అక్కడ ఇస్రో అధికారులు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అధికారులు సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ కి జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సంజిత్ కుమార్ మాట్లాడుతూ మార్చి 7వ తేదీన కలకత్తా నగరం నుండి ప్రారంభమైన ఈ సైక్లోథాన్ ర్యాలీ 9 రాష్ట్రాల గుండా 25 రోజుల పాటు కొనసాగి 6553 కిలోమీటర్లు పూర్తిచేసుకుని మార్చి 31వ తేదీ నాటికి కన్యాకుమారిలో ఈ ర్యాలీ ముగుస్తుందన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాల ద్వారా ఇతర దేశాలకు చెందిన ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, దీనిపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. అనంతరం సౌత్ సెక్టార్ ఐ.జి (ఐ.పీ.ఎస్) ఎస్.ఆర్.శరవనన్, ఇస్రో షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ 2 హైదరాబాద్ డిఐజి అపరాజిత మహాపాత్ర, కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి, గ్రూప్ మేనేజర్ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.