కావలిలో రెండు రోజులుగా నిర్వహించిన టెన్నీస్ పోటీలు
ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డ జట్లు. విజేతలకు కప్ లు, నగదు బహుమతులు
కావలిలో టెన్నీస్ విజేతలు వీరే…!
- కావలిలో రెండు రోజులుగా నిర్వహించిన టెన్నీస్ పోటీలు
- ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డ జట్లు. విజేతలకు కప్ లు, నగదు బహుమతులు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సి ఎల్ ఎన్ రెడ్డి సుజానమ్మ ట్రస్ట్ టెన్నీస్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డారు. 70 ప్లస్ విభాగంలో విన్నర్స్ గా నెల్లూరు, రన్నర్స్ కాళహస్త్రీ జట్లు నిలిచాయి. అదేవిధంగా 60 ప్లస్ విభాగంలో విన్నర్స్ కావలి,రన్నర్స్ కర్ణాటక, 50 ప్లస్ విభాగంలో విన్నర్స్ కాళహస్తి, రన్నర్స్ కావలి, 40 ప్లస్ విభాగంలో విన్నర్స్ కావలి, రన్నర్స్ విజయవాడ జట్లు నిలిచాయి. 30 ప్లస్ విభాగంలో విన్నర్స్ కావలి, రన్నర్స్ కడప జట్లు నిలిచాయి. వీరికి ముఖ్య అతిథులుగా వచ్చిన
జీవీకే అడ్వైజర్ ఆదిశేషారెడ్డి, రిటైర్డ్ ఏఎస్ పి నాగేశ్వర రావు, వైద్యులు చంద్రశేఖర్ చేతులమీదుగా విన్నర్స్, రన్నర్స్ జట్లుకు కప్ లు, నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు అనుమలశెట్టి రామకృష్ణ, వంశీ మోహన్, కృష్ణ ప్రసాద్, ప్రసాద్ రెడ్డి, జగదీష్, మణి, సిరి, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.