సుమారు 90 మందికి పనులు చేయకుండా బిల్లులు చెల్లింపు
టీపీగూడూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందచేసిన మండల వైసీపీ అధ్యక్షులు ఉప్పల
ఉపాధిలో అవకతకలు
- సుమారు 90 మందికి పనులు చేయకుండా బిల్లులు చెల్లింపు
- టీపీగూడూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందచేసిన మండల వైసీపీ అధ్యక్షులు ఉప్పల
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలో జరిగిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీల వివరాలు, చెల్లించిన వేతనాల వివరాలు బయట పెట్టాలని మండల ycp అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివరాలు తెలియజేయలని అధికారులకు అర్జీ సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 90 మంది పనికి హాజరు కాకుండానే నగదు చెల్లించినట్లు తమకు సమాచారం వచ్చిందహన్నారు. గత ప్రభుత్వంలో కాలువలు శుభ్రం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఆదివారం కూడా పనులు చేసి బిల్లులు పెట్టుకున్నట్లు అభియోగాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.