వైసీపీ నేతలకు కోవూరు ఎమ్మెల్యే హెచ్చరిక
టిడిపిలో చేరిన బుచ్చిరెడ్డిపాలెం వైసిపి నేతలు
కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు
వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయారన్న ప్రశాంతిరెడ్డి
మాకు నీతులు చెప్పొద్దు
- వైసీపీ నేతలకు కోవూరు ఎమ్మెల్యే హెచ్చరిక
- టిడిపిలో చేరిన బుచ్చిరెడ్డిపాలెం వైసిపి నేతలు
- కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు
- వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయారన్న ప్రశాంతిరెడ్డి
అధికారం పోయి తొమ్మిది నెలల గడిచిన మేమే బుద్ధిమంతులం అని వైసీపీ నేతలు చెప్పుకుని తిరగుతున్నారనీ.. అయితే ఆ పార్టీలో ఇమడలేక పలువురు టీడీపీలోకి వస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొని వైసీపీ నేతలను టీడిలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వైసిపి తీరుతో ఆ పార్టీలో నాయకులే విసిగిపోయారని విమర్శించారు.. కూటమి ప్రభుత్వంలోని ఐక్యమత్యాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ విమర్శలు చేస్తుందనీ మండిపడ్డారు.. ప్రజాసేవ చేసేందుకే తమ రాజకీయాల్లోకి వచ్చామని… ఆవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ నాయకులు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు..