ఆత్మకూరులో పోలీసుల సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
పోలీసుల సేవలను కొనియాడిన మంత్రి ఆనం
- ఆత్మకూరులో పోలీసుల సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభం
- లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సరఫరా తప్పనిసరి అని, అన్ని ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న పోలీసులకు మంత్రి ఆనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.