మ‌రో 15 ఏళ్లు మ‌న‌ కూట‌మే

అంద‌రం క‌లిసి మెల‌సి ప‌ని చేద్దాం

జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం

ఆత్మ‌కూరులో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం

ఆనం మంత్రి అవ్వ‌డం మీ అదృష్టమ‌న్న ఎంపీ వేమిరెడ్డి

ఎంపీ చొర‌వ తీసుకుంటేనే ప‌నుల‌వుతాయ‌న్న మంత్రి ఆనం

మ‌రో 15 ఏళ్లు మ‌న‌ కూట‌మే…!

  • అంద‌రం క‌లిసి మెల‌సి ప‌ని చేద్దాం
  • జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
  • ఆత్మ‌కూరులో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీగా ఎదురుగా ఉన్న మైదానంలో… నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రాష్ట్ర దేవ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో…. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఆనం, వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌ల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ఆత్మీయ స‌మావేశాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు…కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. మ‌రో 15 ఏళ్ల పాటు మ‌న కూట‌మి ప్ర‌భుత్వ‌మే కొన‌సాగాల‌ని…అంద‌రం క‌లిసి మెల‌సి ప‌ని చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌ధ్యంలో జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామ‌న్నారు. అనంత‌రం వారు ఆత్మీయ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గంలోని కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *