ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరులో లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపినీ చేసిన ఎమ్మెల్యే.
బాధితులకి అండగా సీఎం రిలీఫ్ ఫండ్…
- ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- వింజమూరులో లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపినీ చేసిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 78 మంది లబ్ధిదారులకి రూ. 92 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ….నియోజకవర్గంలో ఆరోగ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతం వింజమూరు అన్నారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేద కుటుంబాల్లో సంతోషాన్ని చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.