దివ్యాంగుల ముఖాల్లో చిరున‌వ్వులు చూశాం

పండుగ‌లా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ

ఆత్మ‌కూరులో దివ్యాంగుల‌కి ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ.

పండుగ‌లా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ…

  • దివ్యాంగుల ముఖాల్లో చిరున‌వ్వులు చూశాం…
  • ఆత్మ‌కూరులో దివ్యాంగుల‌కి ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ

వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో… నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌హ‌కారంతో..
ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో దివ్యాంగుల‌కి రూ. 60 ల‌క్ష‌ల విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌లు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా వారు….దివ్యాంగుల్ని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వారు ఒక్కొక్కరికి రూ. 40వేలు విలువచేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం దివ్యాంగుల ముఖాల్లో చిరున‌వ్వులు చూశామ‌ని నేత‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా దివ్యాంగులంద‌రూ థ్యాంక్యూ సార్‌…అంటూ త‌మ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ… అంద‌రిని చూస్తుంటే ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు మ‌రెన్నో చేయాల‌ని ఒక సంక‌ల్పం క‌లుగుతుంద‌న్నారు. ఇంకా మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌ని…వాటిని కూడా త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. ఆనం మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌హ‌కారంతో పూర్తి చేస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *