పెట్రోల్ ముందున్న నుజ్జు నుజ్జు అయిన తోపుడు బండ్లు – సంగంలో ఘటన
పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన లారీ…
- పెట్రోల్ ముందున్న నుజ్జు నుజ్జు అయిన తోపుడు బండ్లు
- సంగంలో ఘటన
నెల్లూరు జిల్లా సంగం కొండ కూడలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుండి వేగంగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతే కాకుండా వరి కోత యంత్రాలు,పెట్రోల్ బంక్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి.పెట్రోల్ బంక్ ముందు వరి కోత యంత్రాలు, తోపుడు బండ్లు ఉండటంతో పెట్రోల్ బంక్ కి భారీ ప్రమాదం తప్పింది. పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.