కావలి అఫిషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సి.ఎల్.ఎన్. రెడ్డి, సుజనమ్మ ట్రస్ట్
జాతీయ టెన్నీస్ టోర్నమెంట్ ప్రారంభించిన కావలి డిఎస్పీ శ్రీధర్
పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, కావలి తహశీల్దారు
టెన్నీస్ ఓ మంచి ఫిట్ నెస్ ఆట…!
- కావలి అఫిషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సి.ఎల్.ఎన్. రెడ్డి, సుజనమ్మ ట్రస్ట్ జాతీయ టెన్నీస్ టోర్నమెంట్
- ప్రారంభించిన కావలి డిఎస్పీ శ్రీధర్
- పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, కావలి తహశీల్దారు
కావలి అఫిషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సి. ఎల్.ఎన్. రెడ్డి, సుజనమ్మ ట్రస్ట్ జాతీయ టెన్నీస్ టోర్నమెంట్ ను శనివారం కావలి డిఎస్పీ శ్రీధర్, ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి తహశీల్దారు శ్రావణ్ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరు మీడియాతో మాట్లాడుతూ టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహణలో కావలికి మంచి గుర్తింపు ఉందని, దీనిని కొనసాగించాలని కోరారు. ఫుట్ బాల్ ఆట తర్వాత మంచి ఫిట్ నెస్ ఉన్న ఆట టెన్నీస్ అన్నారు. ఈ ఆట శక్తి సామర్థ్యంతో పాటు మంచి ఆరోగ్యం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టోర్నమెంట్ కార్యనిర్వహకులు అనుమలశెట్టి రామకృష్ణ, పి.డి ప్రసాద్ రెడ్డి , జగదీష్ , కృష్ణ ప్రసాద్ , రమణయ్య ,శ్రీధర్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.