విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ప్రజల పక్షాన పోరాటమే
ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం నేతలు
నెల్లూరు సీపీఎం కార్యాలయంలో జగన్ సర్కార్ పోయి…
బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులు కరపత్రం ఆవిష్కరణ
స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి…
- విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ప్రజల పక్షాన పోరాటమే
- ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం నేతలు
- నెల్లూరు సీపీఎం కార్యాలయంలో జగన్ సర్కార్ పోయి…బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులు కరపత్రం ఆవిష్కరణ
నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో జగన్ సర్కార్ పోయి…బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులు అంటూ కరపత్రాన్ని సీపీఎం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వమే అదనపు ఛార్జీలను భరించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వం వెంటనే తగ్గించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అజయ్ కుమార్ మాట్లాడారు. ఈ సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్ రావు, మాదాల.వెంకటేశ్వర్లు, గోగుల. శ్రీనివాసులు.షేక్ రెహనా బేగం, మూలె వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.