రాజకీయాలలో అంతర్గత విభేధాలు సర్వసాధారణం
తరువాత మేము క్షమాపణలు చెప్పుకున్నాం రూప్ కుమార్ నాకు సహోదరుడు
నా రాజకీయ ప్రయాణం ప్రశాంతిరెడ్డితోనే – మీడియాతో టీడీపీ నేత యర్రంరెడ్డి
నాకు, రూప్ మధ్య గొడవ నిజమే
- రాజకీయాలలో అంతర్గత విభేధాలు సర్వసాధారణం
- తరువాత మేము క్షమాపణలు చెప్పుకున్నాం రూప్ కుమార్ నాకు సహోదరుడు
- నా రాజకీయ ప్రయాణం ప్రశాంతిరెడ్డితోనే
- మీడియాతో టీడీపీ నేత యర్రంరెడ్డి
గత నాలుగు రోజులుగా సింహపురి జిల్లాలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. పెన్నా డెల్టా మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి చుట్టే రాజకీయ తిరిగింది..ఇటివల విజయవాడలో కోవూరు ఎమ్మెల్యే నివాసంలో ఇద్దరి మద్య నువ్వెంతంటే నువ్వెంత అనే స్ధాయిలో కొట్లాట జరిగిందనీ హాట్హాట్గా చర్చ నడుస్తున్న క్రమంలో ఇవాల గోవర్ధన్ క్లారిటీ ఇచ్చేశారు..ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం జరిగిన మాట వాస్తవమేననీ చెప్పారు..అయితే వెంట వెంటనే క్షమాపణలు కూడ జరిగాయనీ అన్నారు..రూప్ కుమార్ తనకు సహోదరులాంటి వాడన్నారు.. రాజకీయాల్లో అంతర్గత విభేదాలు విమర్శలు సర్వసాధారణమని చెప్పుకొచ్చారు.. ఇటీవల పలు పత్రికలలో తమపై అవాస్తవాలు ప్రచురిస్తున్నారనీ మండిపడ్డారు.. తాను ఉన్నంత కాలం ప్రశాంతిరెడ్డితోన ప్రయాణం సాగిస్తాననీ చెప్పారు..నెల్లూరు జిల్లా బుచ్చి మండలం రేబాలలోని తన స్వగృహంలో అనుచరులతో కలిసి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..ఓసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం..