సోమిరెడ్డి సార్‌.. మీరే నాకు న్యాయం చేయాలి..

క‌క్ష‌పూరితంగానే న‌న్ను స‌స్పెండ్ చేశారు

ఎలాంటి నోటీసు లేకుండానే స‌స్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ‌

టీపీగూడూరు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల పీఈటీ టీచ‌ర్ హేమ‌ల‌త

సోమిరెడ్డి సార్‌…మీరే నాకు న్యాయం చేయాలి…

  • క‌క్ష‌పూరితంగానే న‌న్ను స‌స్పెండ్ చేశారు
  • ఎలాంటి నోటీసు లేకుండానే స‌స్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ‌
  • టీపీగూడూరు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల పీఈటీ టీచ‌ర్ హేమ‌ల‌త

నెల్లూరు జిల్లా తోట‌ప‌ల్లిగూడూరు మండ‌లంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల‌లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తోన్న త‌న‌ను ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ క‌క్ష‌పూరితంగానే స‌స్పెండ్ చేసింద‌ని…టీచ‌ర్ హేమ‌ల‌త ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఆమె త‌న త‌ల్లితో క‌లిసి…గురుకుల పాఠ‌శాల బ‌య‌ట మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా, స‌రైన కార‌ణాలు లేకుండానే త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ చేసే కొన్ని అవినీతి విష‌యాలు త‌న‌కు తెలిసి ఉండ‌డంతోనే స‌స్పెన్ష‌న్ జ‌రిగింద‌న్నారు. గ‌త ప‌ది నెల‌లుగా త‌న‌కు జీతం రావాల్సి ఉంద‌న్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సార్‌, ఉన్న‌తాధికారులు స్పందించి స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి…త‌న‌కు న్యాయం చేయాల‌ని హేమ‌ల‌త మీడియా ముఖంగా వేడుకుంది. అనంత‌రం హేమ‌ల‌త త‌ల్లి మాట్లాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *