భక్తులకి స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం
సీఎం మనవడు నారా దేవాన్ష్ పుట్టిన సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
తిరుమలలోని దేవదేవుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు
వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా…
- భక్తులకి స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం
- సీఎం మనవడు నారా దేవాన్ష్ పుట్టిన సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
- తిరుమలలోని దేవదేవుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా సీఎం భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. మనువడు నారా దేవాన్ష్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చును ఆన్లైన్ ద్వారా విరాళంగా అందించినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు.