అయ్యా మంత్రి గారు.. దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి

న‌గ‌రంలో అధ్వానంగా పారిశుధ్యం – కొళాయిల్లో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా

సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ

బాలాజీన‌గ‌ర్ స‌చివాల‌యం ఎదుట ధ‌ర్నా

అయ్యా మంత్రి గారు…
దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి

  • న‌గ‌రంలో అధ్వానంగా పారిశుధ్యం
  • కొళాయిల్లో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా
  • సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ
  • బాలాజీన‌గ‌ర్ స‌చివాల‌యం ఎదుట ధ‌ర్నా

నెల్లూరు నగరంలో దోమలు, పారిశుద్యం, డ్రైనేజీ, కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టింది. న‌గ‌రంలోని సీపీఎం కార్యాల‌యం నుంచి స్థానిక స‌చివాల‌యం వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లి…అనంత‌రం స‌చివాల‌యం ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. అయ్యా మంత్రి గారు…దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీపీఎం పార్టీ న‌గ‌ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సూర్య‌నారాయ‌ణ‌, కాయంబు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పేరు గొప్ప‌…ఊరు దిబ్బ అన్న చందాన నెల్లూరు న‌గ‌ర ప‌రిస్థితి ఉంద‌ని ఎద్దేవా చేశారు. న‌గ‌రంలోని 28వ డివిజ‌న్ల‌లో సీపీఎం ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లో నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. యాత్ర‌లో భాగంగా స్థానిక ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను దృష్టికి తీసుకువ‌స్తున్నార‌న్నారు. ముఖ్యంగా న‌గ‌రంలో దోమ‌లు, పారిశుధ్యం, డ్రైనేజీ, కొళాయిల్లో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌లు అధికంగా ఉన్నాయ‌న్నారు. వెంట‌నే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స్పందించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో త‌మ పోరాటాన్ని ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *