నెల్లూరు జిల్లా కావలి లొ గోల్డ్ షాపులపై జీఎస్టీ అధికారుల దాడులు.
దుకాణాలకు తాళాలు వేసి పలాయనం చిత్తగించిన వ్యాపారులు
ఆరు దుకాణాల్లో నిరాటకంగా తనిఖీలు -సమాచారం వెల్లడికి జీఎస్టీ అధికారులు నిరాకరణ
బంగారం వ్యాపారులు పరుగో పరుగు..!
-నెల్లూరు జిల్లా కావలి లొ గోల్డ్ షాపులపై జీఎస్టీ అధికారుల దాడులు.
-దుకాణాలకు తాళాలు వేసి పలాయనం చిత్తగించిన వ్యాపారులు
-ఆరు దుకాణాల్లో నిరాటకంగా తనిఖీలు
-సమాచారం వెల్లడికి జీఎస్టీ అధికారులు నిరాకరణ
నెల్లూరు జిల్లా కావలిలో కేంద్ర జీఎస్టీ అధికారులు బంగారం వ్యాపారులను హడలెత్తించారు. ఏకకాలంలో దుకాణాల్లో ఆకస్మిక దాడులు చేశారు. విషయం తెలుసుకున్న బంగారం వ్యాపారులు వారి దుకాణాలకు తాళాలు వేసి పరుగులు తీశారు. నిత్యం రద్దీగా ఉండే బంగారు కోట్ల బజారు ఒక్కసారిగా బోసిపోయింది.గుంటూరు జోన్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, తదితరు అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. బంగారం కొనుగోలు, అమ్మకాలపై ఆరా తీసినట్లు సమాచారం. గోల్డ్ షాప్ నిర్వాహకులపై ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు దుకాణాల్లో నిరాటంకంగా తనిఖీలు చేశారు. మీడియాకు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. జీఎస్టీ అధికారులు వచ్చారని తెలియగానే దుకాణలన్నీ మూసివేశారంటే అక్కడ ఎంత పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయో
అన్న అనుమానాలు రాకమానలేదు.