ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న వీపీఆర్‌

23న వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరులో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

భారీ స్థాయిలో ఏర్పాట్లు.. ముమ్మరంగా సాగుతున్న పనులు

హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న వీపీఆర్‌..!

-23న వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరులో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

  • కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
  • భారీ స్థాయిలో ఏర్పాట్లు.. ముమ్మరంగా సాగుతున్న పనులు
  • హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

దివ్యాంగులకు ఆసరాగా నిలిచేందుకు వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆత్మకూరుకు చేరుకుంది. ఈ నెల 23న ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గస్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను ఆయ‌న నెర‌వేరుస్తూ.. ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గవ్యాప్తంగా దివ్యాంగులను గుర్తించి వారికి విపి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విలువైన ఎలక్ట్రికల్‌ ట్రై సైకిళ్లు అందిస్తున్నారు. ఇప్ప‌టికే.. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో కోవూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో ట్రై సైకిళ్ల పంపిణీ పూర్తి చేశారు. ఈ నెల 23న ఆదివారం ఉదయం 10:00 గంటలకు ఆత్మకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 150 మందికి పైగా ట్రై సైకిళ్లు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *