అంగ‌రంగ వైభ‌వంగా రంగ‌డి తెప్పోత్స‌వం

భారీ ఏర్పాట్లు చేసిన ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి

ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి దంప‌తులు

ద‌గ్గ‌రుండి బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించిన డీఎస్పీ సింధూప్రియ‌

అంగ‌రంగ వైభ‌వంగా రంగ‌డి తెప్పోత్స‌వం
-భారీ ఏర్పాట్లు చేసిన ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి
-ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి దంప‌తులు

-ద‌గ్గ‌రుండి బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించిన డీఎస్పీ సింధూప్రియ‌

నెల్లూరులో వెల‌సియున్న శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ స్వామి వారి దేవ‌స్థానం బ్రహ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా.. క‌న్నుల పండువుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి వారి భ‌క్త బృందం ఉభ‌య‌క‌ర్త‌లుగా.. గురువారం రాత్రి పెన్న‌మ్మ ఒడిలో తెప్పోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆల‌య ఛైర్మ‌న్‌, ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. జిల్లా ఎస్పీ, డీఎస్పీల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎక్క‌డా భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా బారీకేట్లు, బందో బ‌స్తు ఏర్పాట్లు చేశారు. ముందుగా.. భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని.. అనంత‌రం తెప్పోత్స‌వాన్ని క‌నులారా వీక్షించారు. ఈ తెప్పోత్స‌వ మ‌హోత్స‌వానికి నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు, న‌గ‌ర డీఎస్పీ సింధూప్రియ‌, ఆల‌య ఛైర్మ‌న్‌, ఈవో, న‌గ‌ర సీఐలు, ఎస్సైలు పాల్లొన్నారు. ఈసంద‌ర్భంగా కోటంరెడ్డి, డీఎస్పీ, ఈవోలు మీడియాతో మాట్లాడారు. ఉత్స‌వాల గురించి, ఏర్పాట్లు, బందోబ‌స్తు త‌దిత‌ర విష‌యాల‌ను వెళ్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *