20 మందికి రూ. 20 ల‌క్ష‌లు

ఎనిమిది నెల‌ల్లో ఒక్క రూర‌ల్‌లో సుమారు రూ. 70 ల‌క్ష‌లు

ల‌బ్ధిదారుల‌కి సీఎం స‌హాయ నిధి చెక్కుల‌ను పంపిణీ చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి.

20 మందికి రూ. 20 ల‌క్ష‌లు….

  • ఎనిమిది నెల‌ల్లో ఒక్క రూర‌ల్‌లో సుమారు రూ. 70 ల‌క్ష‌లు
  • ల‌బ్ధిదారుల‌కి సీఎం స‌హాయ నిధి చెక్కుల‌ను పంపిణీ చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి వలన చాలా మంది పేద,నిరుపేద,సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజికవర్గం నుండి రూ. 20 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 20మంది లబ్ధిదారులకు ఆయ‌న మాజీ మేయ‌ర్ నందిమండ‌లం భానుశ్రీతో క‌లిసి అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నార‌న్నార‌ని…చెక్కుల‌ను కూడా ల‌బ్ధిదారుల‌కి వేగ‌వంత‌గా చేరుస్తున్నార‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఎనిమిది నెల‌ల్లోనే ఒక్క రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు రూ. 70 ల‌క్ష‌ల సీఎం స‌హాయ నిధి కింద నిధులు కేటాయించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *