చేనేతలకు ఉపాధి కల్పించాలి
ఉచితంగా ఇస్తామన్న 200 యూనిట్ల విద్యుత్ వెంటనే ఇవ్వాలి
వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయకులు కందారపు మురళి
చేనేతలకు నెలలో 15 రోజులు కూడా పని దొరకడంలేదు..!!
-చేనేతలకు ఉపాధి కల్పించాలి
-ఉచితంగా ఇస్తామన్న 200 యూనిట్ల విద్యుత్ వెంటనే ఇవ్వాలి
-వెంకటగిరిలో ప్రజా చైతన్య యాత్రలో సీపీఎం నాయకులు కందారపు మురళి
తిరుపతి జిల్లా.. వెంకటగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకటి, రెండు, మూడు వార్డులలో బంగారు పేట ప్రజా సమస్యల పరిష్కారానికై , సిపిఎం నాయకులు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయన్నారు. చేనేత కార్మికుల పరిస్థితి ధననీయంగా ఉందన్నారు, పట్టు, పేక నూలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నెలలో 15 రోజులు కూడా చేనేత కార్మికులకు పని దొరకడం లేదని, వీరికి ఉపాధి కల్పించాలని, చేనేత కార్మికులకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని.. దాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఈసందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే.. బంగారు పేట స్మశానానికి సంబంధించిన 11 ఎకరాలు భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించారని.. ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. లేదంటే.. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో.. సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి చంగయ్య, బంగారు పేట శాఖ కార్యదర్శి ఐలా భాస్కర్, సుబ్బరాయుడు చంద్రశేఖర్, రత్తమ్మ రాజయ్య, నారాయణ పాల్గొన్నారు.