రైతులకు సమస్య ఉంటేనే అసెంబ్లీలో చర్చ జరిగింది
మంచి ధర వస్తే మిగతా పార్టీల రైతులు ధాన్యం అమ్ముకోరా
టీడీపీ నాయకుల కామెంట్స్ పై వైసీపీ నాయకుల కౌంటర్
వైసీపీ వడ్లు…టీడీపీ వడ్లు ఉంటాయా…?
- రైతులకు సమస్య ఉంటేనే అసెంబ్లీలో చర్చ జరిగింది
- మంచి ధర వస్తే మిగతా పార్టీల రైతులు ధాన్యం అమ్ముకోరా
- టీడీపీ నాయకుల కామెంట్స్ పై వైసీపీ నాయకుల కౌంటర్.
వరి ధాన్యానికి మంచి రేటు వస్తే ఒక్క వైఎస్సార్సీపీ వాళ్లేనా వడ్లు అమ్ముకునేది….మిగతా పార్టీల వాళ్ళ కి వడ్లు లేవా…వాళ్లకి ప్రయోజనం ఉండదా ….అని డమ్మాయపాలెం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం పంచాయితీ పరిధిలోని పోతునాయుడుదిబ్బలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ….వరి రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్న విషయం అన్నీ పార్టీల వారికి తెలుసన్నారు. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీలో సైతం చర్చ జరిగిందని….అయితే అదే విషయాన్ని తమ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎస్సి సెల్ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ…వరి ధాన్యానికి సరైన ధర లేక ఎకరానికి వేల రూపాయల వరకు నష్టం జరుగుతుందని, కౌలు రైతుల పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉందన్నారు. దువ్వూరు రామనాధ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ వడ్లు, టీడీపీ వడ్లు వేరుగా ఉండవని, మంచి ధర వస్తే అందరికీ ప్రయోజనం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బరామి రెడ్డి, పంట్రంగి మురళీకృష్ణ, మూగా చిన్నా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.