రెచ్చిపోతున్న మట్టి మాఫియా

కోటలో అంతా మా ఇష్టం అంటున్న మాఫియా

పట్టించుకోని అధికారులు

భయాందోళనలలో ప్రజలు.

రెచ్చిపోతున్న మట్టి మాఫియా…

  • కోటలో అంతా మా ఇష్టం అంటున్న మాఫియా
  • పట్టించుకోని అధికారులు
  • భయాందోళనలలో ప్రజలు తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో మట్టి మాఫియా రోజురోజుకీ రెచ్చిపోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    రాత్రి పగలు తేడా లేకుండా స్వర్ణముఖి ఏర్పు ఒడ్డు ఉన్న దువ్వ మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమార్కులు తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా…సంబంధిత అధికారులు చూసి చూడనట్టు పట్టి పట్టనట్టు వ్యవహరించడంపై అనేక‌ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మట్టి మాఫియా కోట నడుబొడ్డునే మట్టిని తోలుతున్నా..అధికారులు ఏ ఒక్క ట్రాక్టర్ ని పట్టుకోకపోవడం గమనార్హం. రోడ్లపై ఏ టైంలో ఏం జరుగుతుందో అని ప్రయాణికులు, వాహనదారులు అధికారుల నిర్లక్ష్యం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాకి అడ్డు కట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *