రాపూరు పోలీసుల అదుపులో 11 మంది
రూ. 6,800 నగదు, 11 మొబైల్స్, 13 బైక్లు, ఆరు కోడి పుంజులు స్వాధీనం
కోడి పందెం స్థావరంపై మెరుపు దాడి….
- రాపూరు పోలీసుల అదుపులో 11 మంది
- రూ. 6,800 నగదు, 11 మొబైల్స్, 133 బైక్లు, ఆరు కోడి పుంజులు స్వాధీనం
నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని సైదాదుపల్లి గ్రామం అటవీ ప్రాంతంలోని కోడి పందెం స్థావరంపై రాపూరు ఎస్సైవెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతోపాటు…వారి వద్ద నుంచి రూ. 6,800 నగదు, 11 సెల్ ఫోన్లు, 13 బైక్లు, ఆరు కోడి పుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ… మండలంలో ఎవరైనా అసాంఘి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.