వైభవంగా కొనసాగుతున్న రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
పుణ్యకోటి విమానంలో రంగడు…
- వైభవంగా కొనసాగుతున్న రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పొన్న వాహనంపై రంగనాథుడు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వారంతా స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పొన్న వాహనంపై ఊరేగిన రంగడుని చూస్తూ భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.