కోటలో సమావేశమైన స్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
హలో మాల – ఛలో తిరుపతి
- కోటలో సమావేశమైన స్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
సుప్రీం కోర్టు ఇచ్చిన రాజ్యాంగవ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది మాలలతో ఆదివారం తిరుపతిలో జరుగు సభను జయప్రదం చేయాలని మాల గెజిటర్ ఆఫీసర్ తిరుపతి జిల్లా అసోసియేషన్ చెర్మన్ వెంట్రపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోటలో ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజురు మాధవ్ మాట్లాడుతూ 83 లక్షల ఓట్లతో ఏ రాజకీయ పార్టీకి అయినా మా సత్తా చాటిచెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు దాసరి అశోక్ బాబు, పాల మల్లికార్జున్, పనాబాక హేమంత్, భూపతి సాయి, మీజురు శ్రీనివాసులు, పిండి కేశవులు, కుదురు కోటేశ్వరరావు, రాజమని, సురేష్ పాల్గొన్నారు