సంగం ఎంపీడీవో షాలెట్
ఆదరణ -3 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- సంగం ఎంపీడీవో షాలెట్
నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షాలెట్ మండలంలోని కులవృత్తుదారులకు ఆదరణ 3 పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కులాల వారీగా ఉపకారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కులవృత్తదారులకు ఆధునిక ఉపకరణాలను అందిస్తుందని ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని కులవృత్తదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.