వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి
రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన వేమిరెడ్డి
రంగనాధునికి తిరుమల పట్టు వస్త్రాలు సమర్పించిన
వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి
రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన వేమిరెడ్డి
పెన్నా నది తీరంలో వె లిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము బ్రహ్మోత్సవములు సందర్భముగా శనివారం రాత్రి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానముల నుండి అధికారులు వచ్చి శ్రీ స్వామి వారి పట్టువస్త్రములు తీసుకొచ్చారు. ఈ వస్త్రాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి చేతులమీదుగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించి స్వామివారికి సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వినియోగాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం జరుగునున్న రథోత్సవ ఏర్పాట్లను వేమిరెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు జై శ్రీనివాసరావు, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, అర్చక స్వాములు ఇతర నాయకులు పాల్గొన్నారు.