ప‌ని క‌ల్పించాల్సిన బాధ్య‌త మ‌న‌దే

నిర్ణీత వంద రోజుల్లో ప‌ని దినాలు క‌ల్పించాలి – క‌లెక్ట‌ర్ ఆనంద్‌

నెల్లూరు క‌స్తూరిభా క‌ళా క్షేత్రంలో ఉపాధి హామీ ప‌థ‌కంపై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

ప‌ని క‌ల్పించాల్సిన బాధ్య‌త మ‌న‌దే…

  • నిర్ణీత వంద రోజుల్లో ప‌ని దినాలు క‌ల్పించాలి
  • క‌లెక్ట‌ర్ ఆనంద్‌
  • నెల్లూరు క‌స్తూరిభా క‌ళా క్షేత్రంలో ఉపాధి హామీ ప‌థ‌కంపై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

ఉపాధి హామీ పథకంలో పనులను అడగలేని పేద ఎస్టి లబ్ధిదారులను గుర్తించి, వారిని ప్రోత్సహించి పని కల్పించాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సూచించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు పై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. గ్రామీణులకు ఉపాధి కల్పించే ఈ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ ను వేజ్ కాంపోనెంట్ ను పెంచాలన్నారు. నిర్ణీత వంద రోజుల పని దినాలను కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించలేదనే మాట రాకుండా అన్నివిధాలా చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవంగా పనిలేని వారికి తప్పనిసరిగా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఇస్తున్నటువంటి శిక్షణను ఉపయోగించుకొవాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంచాలకులు వికే షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఫామ్ పొండ్స్‌ను తవ్వించుకోవచ్చునని, దీని ద్వారా వర్షపు నీటిని నిల్వచేయడం, నీటి కొరత సమస్యను తగ్గించడం, భూగర్భ జలాల రీఛార్జ్ చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్, డ్వామా పిడి గంగా భవాని, డ్వామా ఫైనాన్స్ అధికారి కనకదుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *