నిత్యం అందుబాటులో ఉంటాం
ఘనంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం కార్యాలయం ప్రారంభించిన బలిజ కులస్తులు
బలిజలకు అండగా.. శ్రీకృష్ణదేవరాయ సంఘం
-నిత్యం అందుబాటులో ఉంటాం
-ఘనంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం కార్యాలయం ప్రారంభించిన బలిజ కులస్తులు..
చిత్తూరు జిల్లా కుప్పం.. డిసిసి బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకోవాలన్న విషయాలను చర్చికోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం నాయకులు ప్రభాకర్, ఆర్ఎస్ మనీ, డీలర్ వెంకటేష్, జయదీప్, మంజునాథ్, అనసూయ, సోము,నాను, పవన్ మహేష్ మరియు బలిజ కులస్థులు పాల్గొన్నారు.