ఫోన్ చార్జింగ్ వైరు లేదన్నాడని టీ దుకాణదారుడిపై దాడి
కావలి ఆర్టీసి బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి ఘటన
భీతిల్లిన ప్రయాణికులు, సహచర దుకాణదారులు
ఇలాంటి అల్లరిమూకకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్న జనం
అల్లరిమూక విధ్వంసం వీడియో వైరల్…!
- ఫోన్ చార్జింగ్ వైరు లేదన్నాడని టీ దుకాణ దారుడిపై దాడి
- కావలి ఆర్టీసి బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి ఘటన
- భీతిల్లిన ప్రయాణికులు, సహచర దుకాణదారులు
- ఇలాంటి అల్లరిమూకకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్న జనం
కావలి ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం అర్థరాత్రి అల్లరి మూక మత్తులో రెచ్చిపోయారు. బస్టాండ్ లో టీ దుకాణం నడుపుతున్న దీన్ దయాళ్ అనే వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ విశక్షణ రహితంగా దాడి చేసారు. అతని దుకాణంలో వస్తువులు బయట విసిరి పడేసారు. దీంతో అక్కడి ప్రయాణికులు, దుకాణదారులు హడలిపోయారు. దుకాణాలను మూసేసుకున్నారు. ఇంతకీ దాడికి కారణం ఏమిటి అనుకుంటున్నారా ఆ అల్లరిమూక టీ బంకు వద్దకు వచ్చి చార్జింగ్ వైర్ అడిగారు. లేదని సమాధానం చెప్పినందుకే ఈ దాడి చేశారు. అల్లరిమూకలో పోలయ్య, అతనితోపాటు ఉన్నవారిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.