రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర

దగదర్తి మండలం డి ఆర్ పంట కాలవ లో స్ట్రక్చర్స్ నిర్మాణంపై మాలేపాటి అభ్యంతరం

పంటల సాగుకు సిద్ధమవుతూ కాలువలో నీళ్లు వచ్చే సమయంలో పనులు చేయటం ఏమిటని మాలేపాటి ప్రశ్న

రెండో కారు పంట వేయకుండా వైసిపి కుట్ర…!

  • దగదర్తి మండలం డి ఆర్ పంట కాలవ లో స్ట్రక్చర్స్ నిర్మాణంపై మాలేపాటి అభ్యంతరం
  • పంటల సాగుకు సిద్ధమవుతూ కాలువలో నీళ్లు వచ్చే సమయంలో పనులు చేయటం ఏమిటని మాలేపాటి ప్రశ్న

దగదర్తి మండలం డి.ఆర్ పంట కాలువ స్ట్రక్చర్స్ తొలగింపు పై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. సోమవారం కాలువను సందర్శించిన ఆయన పాత స్ట్రక్చర్స్ ను ధ్వంసం చేసి పారుతున్న నీళ్లకు అడ్డుగా పడేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు వెనుకనుండి కాంట్రాక్టర్ చేత ఇప్పుడు కాలువ పనులు చేపట్టేలా కుట్ర పన్నారని తెలిపారు. 2020 లో కాలువ పనులు చేసిన వైసిపి నాయకులు మట్టి పనులు చేసుకుని గోడలు మాత్రమే కట్టారన్నారు. నిర్మించాల్సిన ఆరు స్ట్రక్చర్స్ వదిలేశారన్నారు. ప్రస్తుతం సోమశిలలో పుష్కలంగా నీరుందని, రెండో కారు పంట సాగుకు నీరు అందుతుందన్నారు. ఈ సమయంలో పనులు చేస్తే పంటల సాగుఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ధ్వంసం చేసిన పాత స్ట్రక్చర్స్ ను ఎప్పటిలోపు పూర్తి చేసి నిర్మిస్తారో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *