పొట్టి శ్రీరాములు త్యాగం మరువం

కావలిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి కార్యక్రమం

కావలి ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఆద్వర్యంలో ఘన నివాళులు

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

పొట్టి శ్రీరాములు త్యాగం మరువం…!

  • కావలిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి కార్యక్రమం
  • కావలి ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఆద్వర్యంలో ఘన నివాళులు
  • ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎవరూ మరువకూడదని, ఆయన ప్రాణ త్యాగమే నేటి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని పలువురు నాయకులు తెలిపారు. కావలి పట్టణంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి కార్యక్రమం కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ట్రంక్ రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్, బీజేపీ నేత, ప్రముఖ వస్త్ర వ్యాపారి అమర వెంకట సుబ్బారావులు మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర‌ సమర యోధునిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని దేశ సేవచేసినట్లు చెప్పారు. హరిజనులకు ఆలయ ప్రవేశం ఉండాలని పోరాటం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. ఇలాంటి మహనీయుని ఆశయాలు ఎంతో గొప్పవి అన్నారు. ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి మోడరన్ ఐ హాస్పిటల్ మరియు రిసెర్చ్ సెంటర్ సౌజన్యంతో స్థానిక సాయిబాబా మందిరంలో గ్లాకోమా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం మాల్యాద్రి, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ ఓరుగంటి రామకృష్ణ , ట్రెజరర్ కళ్యాణ్ చక్రవర్తి , నాయకులు వి సునీల్ , గాథం శెట్టి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *