కందుకూరు మున్సిపాలిటీకి రూ. 5 కోట్ల నిధులు మంజూరు
పంచాయతీల్లో తాగునీటి కోసం రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు
రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులకు గత ప్రభుత్వ తప్పిదాలే శాపాలుగా మారాయి
ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం
- కందుకూరు మున్సిపాలిటీకి రూ. 5 కోట్ల నిధులు మంజూరు
- పంచాయతీల్లో తాగునీటి కోసం రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు
- రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులకు గత ప్రభుత్వ తప్పిదాలే శాపాలుగా మారాయి
కందుకూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే నెరవేర్చారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుకూరు పట్టణ అభివృద్ధికి రూ. 50 కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. నెల రోజుల్లోనే ముందస్తుగా రూ. 5 కోట్లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని 19 పంచాయతీలకు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని రూ. 22 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగిందన్నారు. బైపాస్ రోడ్డుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో కొండముడుసుపాళెం వద్ద ఓవర్ బ్రిడ్జికి అనుమతి వచ్చిందన్నారు. సీటీఆర్ఐ నుంచి వాసవీ నగర్ వరకు రూ. 8 కోట్ల నిధులతో రోడ్లు విస్తరణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులకు గత ప్రభుత్వ తప్పిదాలే శాపాలయ్యాయన్నారు. సముచితమైన ప్యాకేజీ వారికి అందేలా చూస్తానన్నారు. తనపై వచ్చే నిందలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.