ప్రభుత్వం, అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పర్వతరెడ్డి
వరికుంటపాడు కమనియంపాడులో అగ్రిగోల్డ్ భూములను పరిశీలించిన వైసీపీ నేతలు
ఐదేళ్ల తరువాత మిగిలేది బూడిదే…
- ప్రభుత్వం, అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పర్వతరెడ్డి
- వరికుంటపాడు కమనియంపాడులో అగ్రిగోల్డ్ భూములను పరిశీలించిన వైసీపీ నేతలు
గ్రామంలో అందరూ చూస్తుండగానే పట్టపగలే సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములలో అక్రమంగా యూకలిప్టస్ చెట్లను టీడీపీ నాయకులు నరికి సొమ్ము చేసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఇదే విధంగా అరాచక పాలన సాగితే ఐదేళ్ల తరువాత మిగిలేది బూడిదేనని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని అగ్రిగోల్డ్ భూములను కాకాణి, మేకపాటిలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు.