త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

ఆర్టీసీ రీజ‌న‌ల్ చైర్మ‌న్ సురేష్ రెడ్డి

ఆర్టీసీ బ‌స్టాండులో రెండు నూత‌న బ‌స్సుల‌ను ప్రారంభించిన చైర్మ‌న్‌

త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు…

  • ఆర్టీసీ రీజ‌న‌ల్ చైర్మ‌న్ సురేష్ రెడ్డి
  • ఆర్టీసీ బ‌స్టాండులో రెండు నూత‌న బ‌స్సుల‌ను ప్రారంభించిన చైర్మ‌న్‌

నెల్లూరు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండులో రెండు నూతన బస్సుల ప్రారంభోత్సవం చేపట్టారు. కార్య‌క్ర‌మానికి ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సురేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు టు పొదిలి ఎక్స్ ప్రెస్, కొత్తూరు టు రాజుపాలెం టౌన్ సర్వీసును ఆయ‌న ఆర్టీసీ అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం మరికొన్ని టౌన్ సర్వీసులను ఏర్పాటు చేస్తామని చైర్మ‌న్ స‌న్న‌పురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో తీసుకొస్తామని చెప్పారు. దాతలు ముందుకొచ్చి ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బస్సులో ప్రయాణించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *