రూర‌ల్‌ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతాం

టిడిపి నాయకులు కోటంరెడ్డి

వైఎస్ఆర్ న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన ర‌హ‌దారిని ప్రారంభించిన కోటంరెడ్డి

రూర‌ల్‌ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతాం

  • టిడిపి నాయకులు కోటంరెడ్డి
  • వైఎస్ఆర్ న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన ర‌హ‌దారిని ప్రారంభించిన కోటంరెడ్డి

శివారు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వైయస్సార్ నగర్ లో నూతనంగా నిర్మించిన ప్రధాన బీటీ రహదారి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా కోటంరెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయ‌న‌కి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా నూత‌న ర‌హ‌దారిని కోటంరెడ్డి ప్రారంభించారు. అనంత‌రం కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారధ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 191 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిలో నెల్లూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. రూరల్ నియోజకవర్గంకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ , క్లస్టర్ ఇంచార్జి మన్నేపల్లి రఘు, యానాదయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *