కోవూరులో పరీక్ష కేంద్రాల వద్ద నెలకొన్న సందడే సందడి
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
- కోవూరులో పరీక్ష కేంద్రాల వద్ద నెలకొన్న సందడే సందడి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి పరీక్షలు ముగింపు సందర్భంగా ఆనందంతో బయటకు వచ్చారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమైనయి శనివారంతో పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అటు అధ్యాపకులు, ఇటు విద్యార్థులు ఉల్లాసంగా కనిపించారు. పరీక్షల ముగింపు సందర్భంగా కోవూరు పట్టణంలోని టీఎంసీ కళాశాలలో విద్యార్థులు పరీక్ష హాల్ నుండి ఆనందంతో బయటికి పరుగులు తీస్తూ కోలాహలం చేశారు.