ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
కుప్పంలో నారా భువనేశ్వరి
- ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గానికి విచ్చేసిన భువనేశ్వరికి టీడీపీ నేతలు, మహిళా నాయకురాళ్లు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా రాళ్లబుదుగురులో శ్రీ కోదండరాములస్వామి వారి రథోత్సవంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శాంతిపురం మండలంలో కురుబ కులస్తుల జాతరతోపాటు…. కదిరి ముత్తనపల్లి చేరుకొని సిద్దేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పెద్ద దేవర జాతరలోనూ నారా భువనేశ్వరి పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.